- మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...కష్టాల్లో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు,లేదా....ఈ లోకాన్నే వదిలి వెళ్ళిన సమయాల్లో...వాళ్ళు కానీ ,వాళ్ళ బంధువులు కానీ మనల్ని ఆహ్వానిస్తేనే మనం వెళ్లి వాళ్లకు(వాళ్ళ బంధువులకు) ఓదార్పు అందించాలనుకోవడం పొరపాటు.....
ఎందుకంటే కొంతమందిని నేను గమనించాను..."వాళ్ళు చెప్పలేదు కదా..." "వాళ్ళు మమ్మల్ని రమ్మని ఆహ్వానించలేదు కదా "అని, ఇంతకు ముందు ఉన్న పంతాలు కొన్ని మనసులో ఉన్న కారణం వలన కూడా పరామర్శించడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు.....
కానీ మనం ఆలస్యం చేసిన ఒక్కొక్క క్షణం జీవితంలో మళ్లీ తిరిగి సరిదిద్దుకోలేని తప్పు చేసే ఒక్కొక్క క్షణం అని గుర్తించాలి.....
అలాంటి సమయాల్లో పంతాలు,పట్టింపులు లేకుండా.....మనం మన ఆత్మీయులకు అన్ని అయి ఓదార్పు అందించాలి.....ఇలాంటి సమయాల్లో మనం చూపించే కాస్త ఓదార్పు వాళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది....
అప్పుడే మనలోని మానవత్వానికి మెరుగులు దిద్దుకోగలం.....!!!!!!!
Thursday, November 21, 2013
మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...
Mana Telugu Radio
Subscribe to:
Post Comments (Atom)
idi nijamga nijam.
ReplyDelete